నామినేషన్​కు వెళ్లి వస్తుండగా బైక్​ చెట్టును ఢీకొని రైతు మృతి

నామినేషన్​కు వెళ్లి వస్తుండగా బైక్​ చెట్టును ఢీకొని రైతు మృతి
  • ములుగు మండలంలో ఘటన

ములుగు, వెలుగు : ములుగులో శుక్రవారం బీఆర్​ఎస్​ అభ్యర్థి బడే నాగజ్యోతి నామినేషన్​ కు హాజరై ఇంటికి వెళ్తున్న ఓ రైతు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. కుటుంబసభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం..ములుగు మండలం కొత్తూరుకు చెందిన దయ్యాల మనోహర్​ (55) శుక్రవారం ములుగులో  బీఆర్ఎస్ ​అభ్యర్థి నాగజ్యోతి నామినేషన్​ ప్రోగ్రామ్​కు బైక్​పై వచ్చాడు.  సాయంత్రం జంగాలపల్లి మీదుగా కొత్తూరుకు వెళ్తుండగా రాంనగర్​ సమీపంలో బైక్​ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది.

తలకు తీవ్ర గాయం కావడంతో చనిపోయాడు. మనోహర్​కు భార్య రాజమ్మ, ఇద్దరు బిడ్డలు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. బిడ్డలకు పెండ్లి కాగా, ఓ కొడుకు మూడేండ్ల క్రితం జరిగిన యాక్సిడెంట్ లో మరణించాడు. ఎకరం పొలం ఉండగా మరో ఎకరం కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసుకునే మనోహర్​.. ఖాళీ సమయాల్లో కూలీ పనులకు వెళ్లేవాడు.