మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కన్నుమూత

మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కన్నుమూత

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ముకేశ్ గౌడ్ కన్నుమూశారు. ఆయన కొన్ని నెలలుగా కేన్సర్ తో బాధపడుతూ హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుది శ్వాస విడిచారు. 2018 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన అపోలో హాస్పిటల్ నుంచి అంబులెన్స్ లో వచ్చి తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. ముఖేష్ గౌడ్ కు భార్య,ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ముఖేష్ గౌడ్ మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పని చేశారు. దాదాపు 30ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు.

ముఖేష్ గౌడ్ మృతికి సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాడ సానుభూతి తెలిపారు.