నిర్మల్ జిల్లా బాసర తహసీల్దార్ కార్యాలయం ముందు పురుగుల మందు డబ్బాతో దేశాయి రాజేశ్వర్ అనే రైతు నిరసన తెలిపాడు. సర్వే నెంబర్ 543లో 14 ఎకరాలు 7 గుంటలు ఉండాల్సిన తన భూమి.... 9 ఎకరాలు మాత్రమే చూపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశాడు. తన భూమిలోని హద్దులు తొలగించారని ఆరోపించాడు.
తన భూమి పక్కన టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అనుచరుల భూమి ఉందని.. అయితే ఇదే అదనుగా తన పొలంలో హద్దులు నాటినట్లు రైతు ఆరోపించాడు. కలెక్టర్, ADలకు ఎన్నిసార్లు చెప్పిన చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. న్యాయం చేయకుంటే తహసీల్ధార్ కార్యాలయం ముందే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని రైతు హెచ్చరించాడు.