తునికాకు బోనస్ ఇవ్వాలని కూలీల ధర్నా

తునికాకు బోనస్ ఇవ్వాలని కూలీల ధర్నా

బెల్లంపల్లి రూరల్, వెలుగు: తునికాకు బోనస్​డబ్బులు ఇవ్వాలంటూ కేతన్ పల్లి, కల్మలపేటకు చెందిన కూలీలు ధర్నాకు దిగారు. కష్టపడి కోసిన తునికాకు ఐదేండ్ల బోనస్​ రావడం లేదని నీల్వాయి అటవీ రేంజ్​కార్యాలయం ముందు రైతులు ధర్నా చేపట్టారు. ఈ విషయంపై ఎఫ్ఎస్ఓ రాములును ప్రశ్నిస్తే దురుసుగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూలీలు ధర్నాకు వస్తున్న విషయం తెలుసుకున్న సిబ్బంది కార్యాలయం నుంచి వెళ్లిపోగా.. దాదాపు 3 గంటల పాటు కార్యాలయం ముందు కూలీలు ధర్నా చేశారు.

ALSO READ:రూ.100 కోట్లతో 500 ఆలయాలు నిర్మించాం: ఇంద్రకరణ్ రెడ్డి

అయినా సిబ్బంది ఎవరు అక్కడికి రాలేదు. 2016 –21 సంవత్సరాలకు చెందిన బోనస్​ గతేడాదే మంజూరు చేసినప్పటికీ కొంత మంది ఖాతాల్లో డబ్బులు పడలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి బోనస్​డబ్బులు ఇప్పించాలని డిమాండ్ చేశారు.