రూ.100 కోట్లతో 500 ఆలయాలు నిర్మించాం: ఇంద్రకరణ్ రెడ్డి

రూ.100 కోట్లతో 500 ఆలయాలు నిర్మించాం: ఇంద్రకరణ్ రెడ్డి

నిర్మల్, వెలుగు: నిర్మల్​ జిల్లాలో రూ.100 కోట్ల వ్యయంతో 500 దేవాలయాలను నిర్మించామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడించారు. బుధవారం స్థానిక గాంధీ చౌక్ లోని మురళీకృష్ణ ఆలయంలో కృష్ణాష్టమిని పురస్కరించుకొని మంత్రి పూజలు చేశారు.  

 

ALSO READ:అధ్వానంగా మోడల్ స్కూల్ రోడ్డు
 

ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ఆధ్యాత్మికతను విస్తరింపజేసేందుకు గతంలో ఎన్నడూ లేని విధంగా దేవాలయాలను నిర్మించామన్నారు. ఆధ్యాత్మికను విస్తరింపజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందన్నారు. చారిత్రక ఆలయాలన్నింటినీ పునర్మిస్తామని పేర్కొన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ పోలిశెట్టి కిషన్, స్థానిక కౌన్సిలర్ మేడారం ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.