కోల్బెల్ట్: గనులపై రైల్వే శాఖ ఈడీ పర్యటన

కోల్బెల్ట్: గనులపై రైల్వే శాఖ ఈడీ పర్యటన

కోల్​బెల్ట్, వెలుగు: మంచిర్యాల, ఆసిఫాబాద్ ​జిల్లాల్లోని సింగరేణి బొగ్గు గనులు, కోల్​హ్యాండ్లింగ్​ ప్లాంట్లపై ఆదివారం కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్​ ట్రాఫిక్​ ట్రాన్స్​ పోర్టేషన్(కోల్) ఆఫీసర్ ​సయ్యద్​ అబ్దుల్​ రెహమాన్​ పర్యటించారు. శ్రీరాంపూర్, రామకృష్ణాపూర్, బెల్లంపల్లి ఏరియాలోని గోలేటీ సింగరేణి సీహెచ్​పీలను సందర్శించి బొగ్గు సైడింగ్ ​విధానాన్ని తనిఖీ చేశారు. 

బొగ్గు రవాణా రైల్వే రేక్​ల కేటాయింపు, వినియోగం, లోడింగ్​ తీరును పరిశీలించారు. సీహెచ్​పీల్లో రైల్వే సైడింగ్​నిర్వహణ తీరుపై సంతృప్తి వ్యక్తంచేశారు. బొగ్గు లోడింగ్​ ప్రక్రియను మరింత స్పీడప్ చేయాలని సంబంధిత ఆఫీసర్లకు సూచించారు. శ్రీరాంపూర్​ ఏరియా ఏస్వోటుజీఎం కృష్ణప్రసాద్, ఇంజనీర్ సురేశ్, సీహెచ్​పీ ఇన్​చార్జ్ చంద్రలింగం, డీజీఎం(సివిల్) ఆనంద్​కుమార్ తదితరులు పాల్గొన్నారు.