రుణమాఫీ త్వరగా పూర్తి చేయాలి : దాసరి అంతయ్య

రుణమాఫీ త్వరగా పూర్తి చేయాలి : దాసరి అంతయ్య

బోధన్, వెలుగు: సాలూరా మండలం జాడిజమాల్​పూర్​సొసైటీ చైర్మన్​ దాసరి అంతయ్య ఆధ్వర్యంలో శుక్రవారం సొసైటీ మహాజన సభ నిర్వహించారు. రైతులందరికీ సకాలంలో రుణామాఫీ చేయాలని సమావేశంలో రైతులు తీర్మానం చేశారు. ఈ సందర్భంగా సొసైటీ  సెక్రటరీ స జమ, ఖర్చులను సభ్యులకు చదివి వినిపించారు. సొసైటీ పరిధిలో 217 మంది  రుణాలు తీసుకోగా125 మందికే మాత్రమే రుణామాఫీ వచ్చిందని రైతులు తెలిపారు. 

మిగిలిన 92 మందికి త్వరలో రుణమాఫీ అందేలా చూడాలన్నారు. సొసైటీ వైస్​చైర్మన్​ అనుషబాయి, కార్యదర్శి శివరామకృష్ణ, డైరెక్టర్లు మరియా కుమార్, ఎం.ఆరోగ్యరాజు, వన్నెల, నర్సింలు, బి.శ్రీనివాస్​రావు, నార్ల వెంకటేశ్వరరావు, పెద్ద మల్కాబోయి తదితరులు పాల్గొన్నారు.

లింగంపేట: సింగిల్​ విండోలో రైతులు తీసుకున్న పంట రుణాలను ఒకేసారి మాఫీ చేయాలని, అసైన్డ్​భూములకు పంటరుణాలు ఇవ్వాలని సింగిల్​విండో మహాజనసభలో రైతులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. నాగిరెడ్డిపేట మండలం తాండూర్​ కిచ్చన్నపేట సింగిల్​ విండో చైర్మన్ ​ఆకిడి గంగారెడ్డి అధ్యక్షతన శుక్రవారం మహాజన సభ నిర్వహించారు.

 సింగిల్​ విండో ఆదాయ, వ్యయాలను విండో సీఈవో  జైపాల్​రెడ్డి చదివి వినిపించారు. సొసైటీ డెవలప్​మెంట్ ​కోసం చేపడుతున్న పనులను చైర్మన్ ​గంగారెడ్డి వివరించారు. కార్యక్రమంలో విండో వైస్​ చైర్మన్​బాబురావు, ఎంపీపీ దివిటి రాజ్​దాస్, డైరెక్టర్లు దివిటి కిష్టయ్య, వేముల సంగయ్య, సిద్ది రాంరెడ్డి, హనుమా నాయక్, కిషన్​నాయక్, బన్సీనాయక్, సర్పంచులు బాల్​రెడ్డి,కృష్ణారెడ్డి పాల్గొన్నారు.