అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ రైతుల ధర్నా

అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ రైతుల ధర్నా

ఏపీకి మూడు రాజధానులు  ఉండే అవకాశం ఉందన్న సీఎం జగన్.. వ్యాఖ్యలపై అమరావతి రైతుల మండిపడుతున్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ మందడం, వెలగపూడి, తుళ్లూరు గ్రామాల్లో రైతులు ధర్నా చేపట్టారు.

మూడు రాజధానుల ఆలోచనను జగన్ మానుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతుల త్యాగాలను మరువొద్దన్నారు. అమరావతి నుంచే పాలన కొనసాగించాలని..ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టొద్దని కోరారు.