ఉద్రిక్తంగా చలో ఢిల్లీ.. సరిహద్దులు మూసివేత

ఉద్రిక్తంగా చలో ఢిల్లీ.. సరిహద్దులు మూసివేత

రైతుల ఛలో ఢిల్లీ కార్యక్రమం హర్యానాలో ఉద్రిక్తంగా మారింది.  కేంద్రం ప్రవేశ పెట్టిన కొత్త వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఇవాళ చలో ఢిల్లీకి హర్యానా, పంజాబ్ రైతులు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ సరిహద్దులను పోలీసులు మూసివేశారు. రోడ్డుకు అడ్డంగా బారీకేడ్లు పెట్టి.. రైతులు ఢిల్లీ వైపు వెళ్లకుండా ఆపేశారు. ఢిల్లీ వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన రైతులను  అడ్డుకున్నారు.  దీంతో ఆగ్రహించిన రైతులు బారీకేడ్లను ఎత్తి బ్రిడ్జి నుంచి కిందకు పడేశారు. రైతులు దూసుకురావడంతో పోలీసులు వాటర్ కెనన్లు.. టియర్ గ్యాస్ ప్రయోగించారు. అయినా రైతులు వెనక్కి తగ్గలేదు. వాహనాలను సైతం తోసేసుకుంటూ ముందుకెళ్లారు.

పంట నష్టపోయిందని వీడియో.. ఆత్మహత్య చేసుకున్న రైతు