ఆమరణ నిరాహార దీక్ష చేయండి..మీకు తోడుంటాం..కేటీఆర్కు రేవంత్ సూచన

ఆమరణ నిరాహార దీక్ష చేయండి..మీకు తోడుంటాం..కేటీఆర్కు రేవంత్ సూచన

 కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి రావాల్సిన నిధులకై కేటీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అందుకు కాంగ్రెస్ కార్యకర్తలు అండగా నిలబడతారని చెప్పారు. గత ప్రభుత్వం కేంద్రంతో గిల్లికజ్జాలు పెట్టిందని విమర్శించారు. తాము అభివృద్ధి కోసం ఏదైనా చేస్తామని చెప్పారు. కేంద్రంతో ఘర్షణ వాతావరణం మంచిది కాదని ప్రధానితో పాటు రక్షణ శాఖ మంత్రిని కలిశామని తెలిపారు.

 అభివృద్ధి కోసం మెట్టు దిగడంలో తప్పు లేదని రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లో రామగుండం ఎలివేటడ్ కారిడార్ కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్ఆర్ఆర్ గురించి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందన్నారు. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి హైదరాబాద్ కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చారని అన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు కాంగ్రెస్ హయాంలోనే వచ్చిందని గుర్తు చేశారు. 

 బీఆర్ఎస్ హయాంలో పబ్బులు, గంజాయి, డ్రగ్స్ వచ్చాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడుతామని అన్నారు. మెట్రో  ఫేజ్ 2కు నిధుల కోసం సహాయం అడుగుతామని తెలిపారు. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు ఎన్నికలు ముగిసాక అభివృద్ది తమ నినాధమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.