హీటర్‌‌ నుంచి మంటలు.. తండ్రీ కూతురు సజీవ దహనం

హీటర్‌‌ నుంచి మంటలు.. తండ్రీ కూతురు సజీవ దహనం
  • హీటర్‌‌ నుంచి మంటలు..
  • తండ్రీ కూతురు సజీవ దహనం
  • రాజస్థాన్‌‌లో ఘోరం 

జైపూర్: రాజస్థాన్‌‌లోని ఖైర్తాల్ తిజార జిల్లాలో ఘోరం జరిగింది. ఇంట్లో వేడి కోసం పెట్టుకున్న హీటర్‌‌‌‌ వల్ల మంటలు చెలరేగి.. ఓ వ్యక్తి, మూడు నెలల చిన్నారి చనిపోయారు. ‘‘శుక్రవారం రాత్రి షేక్‌‌పూర్ పోలీస్ స్టేషన్ ఏరియాలో హీటర్ కారణంగా ఓ ఇంట్లో బొంతకు మంటలు అంటుకున్నాయి. అవి కాస్తా ఇల్లంతా వ్యాపించాయి. దీంతో దీపక్ యాదవ్, అతడి కూతురు నిశింక (3 నెలలు), భార్య సంజు చిక్కుకుపోయారు. 

దీపక్, నిశింక సజీవ దహనం కాగా.. సంజుకు కాలిన గాయాలయ్యాయి. ఈ క్రమంలో బాధితుల అరుపులు విని అక్కడికి చేరుకున్న స్థానికులు.. మంటలను ఆర్పివేశారు. గాయపడ్డ వారిని దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. దీపక్, నిశింక అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. తీవ్రంగా గాయపడిన సంజు.. ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది.