నువ్వు తండ్రివేనా రా సన్నాసి : సైకిల్ కొనివ్వమని కొడుకు అల్లరి.. చంపేసిన నాన్న

నువ్వు తండ్రివేనా రా సన్నాసి : సైకిల్ కొనివ్వమని కొడుకు అల్లరి.. చంపేసిన నాన్న

సైకిల్ కావాలని పదే పదే కోరడంతో ఓ తండ్రి తన కుమారుడిని గొడ్డలితో నరికి చంపాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని సాగర్ జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది.  ఈ దారుణానికి పాల్పడిన అనంతరం ఆ తండ్రి  అక్కడి నుంచి పారిపోయాడు.

అతడిని పట్టుకునేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 12 ఏళ్ల యశ్వంత్ సైకిల్ తీసుకురావాలని తన తండ్రిని పట్టుబడుతున్నాడని తండ్రి మాత్రం డబ్బులు లేవని చెప్పాడన్నారు. 

కానీ  కుమారుడు పదే పదే కోరడంతో  కోపంతో అతని తండ్రి నిర్పత్ లోధి తన కొడుకుపై గొడ్డలితో దాడి చేశాడని, దీంతో యశ్వంత్  అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు.  సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు  ఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేపట్టారు.  పోలీసులు యశ్వంత్  మృతదేహానికి పంచనామా సిద్ధం చేసి పోస్ట్‌మార్టంకు తరలించారు.