చేవెళ్ల, వెలుగు: పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన తన కూతురుకు ఓటు వేసిన తండ్రి గుండెపోటుతో చనిపోయాడు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు అనుబంధ గ్రామమైన వెంకన్నగూడలో 14 వార్డు మెంబర్గా రాములమ్మ పోటీ చేసింది.
ఆమెకు ఓటు వేసిన తండ్రి సోలిపేట బుచ్చయ్య(60) పోలింగ్ బూత్ నుంచి ఇంటికి వెళ్తుండగా గుండెపోటుతో కుప్పకూలాడు. వార్డు మెంబర్గా రాములమ్మ విజయం సాధించారు.
