ముంబయి: భారతదేశపు మొట్టమొదటి ఓరల్ సస్పెన్షన్ ఫావిపిరావిర్ – ఫావెంజా ఓరల్ సస్పెన్షన్ ను ఎఫ్డీసీ లిమిటెడ్ విడుదల చేసింది. మోస్తరు నుంచి మధ్యస్తంగా ఉన్న కోవిడ్–19 లక్షణాలతో బాధపడుతున్న వ్యక్తులకు చికిత్స అందించడానికి ఇది ఉపయోగపడుతుంది. డాక్టర్ ప్రిస్ర్కిప్షన్ పై మాత్రమే విక్రయించే ఈ సొల్యూషన్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని రిటైల్ మెడికల్ ఔట్లెట్లు మరియు ఆస్పత్రి ప్రాంగణాలలోని ఔషద విక్రయశాలల్లో లభ్యమవుతుంది. ఫావెంజా సస్పెన్షన్ లోడింగ్ డోస్ (మొదటి రోజు) 18 మిల్లీ లీటర్లు ఉదయం అలాగే సాయంత్రం 18 మిల్లీ లీటర్లను వాడవలసి ఉంటుంది. ఈ ఫలితాలు ఫావిపిరావిర్ 400మిల్లీగ్రాముల 9 మాత్రల వినియోగానికి సమానంగా ఉంటుంది. తద్వారా కోవిడ్–19 చికిత్స సౌకర్యవంతంగా మారుతుందని సంస్థ ప్రకటించింది.
ఎఫ్డీసీ లిమిటెడ్ జనరల్ మేనేజర్ మయాంక్ టిక్కా మాట్లాడుతూ‘మరోమారు పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో కోవిడ్–19 చికిత్సను సౌకర్యవంతంగా తీర్చిదిద్దడంపై మేము దృష్టి సారించామని అన్నారు. కరోనా మహమ్మారితో చేస్తోన్న యుద్ధంలో దేశంలోని మన హెల్త్ కేర్ వారియర్లుకు అనుకూలమైన అవకాశాలను అందించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.