ఎఫ్‌‌‌‌సీఐ లేఔట్‌‌‌‌ను పున‌‌‌‌రుద్ధరించిన హైడ్రా

ఎఫ్‌‌‌‌సీఐ లేఔట్‌‌‌‌ను పున‌‌‌‌రుద్ధరించిన హైడ్రా
  • ర‌‌‌‌హ‌‌‌‌దారుల‌‌‌‌తో పాటు పార్కుల హ‌‌‌‌ద్దుల నిర్ధార‌‌‌‌ణ‌‌‌‌

గచ్చిబౌలి, వెలుగు: గ‌‌‌‌చ్చిబౌలిలోని ఫెర్టిలై జర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్  కోఆప‌‌‌‌రేటివ్ హౌసింగ్ సొసైటీ లేఔట్‌‌‌‌ను హైడ్రా మంగ‌‌‌‌ళ‌‌‌‌వారం పున‌‌‌‌రుద్ధరించింది. లేఔట్ లో రోడ్లు, పార్కులకు హద్దులను హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులు నిర్ధారించారు. ఈ లేఔట్ హ‌‌‌‌ద్దుల‌‌‌‌ను చెరిపేస్తూ సంధ్య క‌‌‌‌న్వెన్షన్ ప్రతినిధులు ప‌‌‌‌లు నిర్మాణాలు చేయ‌‌‌‌గా.. వాటిని గ‌‌‌‌త నెల 6న హైడ్రా తొల‌‌‌‌గించిన విష‌‌‌‌యం తెలిసిందే. గతంలో ఉన్న లేఔట్ ప్రకారం ర‌‌‌‌హ‌‌‌‌దారులకు హ‌‌‌‌ద్దులు నిర్ధారించి.. వెనువెంట‌‌‌‌నే వాటి నిర్మాణానికి చ‌‌‌‌ర్యలు చేపట్టారు.

 ప్రధాన, ఇంట‌‌‌‌ర్నల్ ర‌‌‌‌హ‌‌‌‌దారుల‌‌‌‌ను పున‌‌‌‌రుద్ధరించి, పార్కులు, ప్రజావ‌‌‌‌స‌‌‌‌రాల‌‌‌‌కు ఉద్దేశించిన స్థలాల హ‌‌‌‌ద్దుల‌‌‌‌ను నిర్ధారించారు. ఇదే లేఔట్ లో మ్యాంగో, యునెక్స్ ఫుడ్ కోర్టులు, స్పైసీ బార్ తో పాటు మరో 7 దుకాణ స‌‌‌‌ముదాయాలు రోడ్డుపై నిర్మించిన‌‌‌‌ట్టు హైడ్రా అధికారులు గుర్తించారు. వాటిని తొల‌‌‌‌గించాల‌‌‌‌ని ఆదేశించారు.

 సినీ నటి రమ్యశ్రీపై దాడి..

జీహెచ్​ఎంసీ, హైడ్రా అధికారులు సంధ్య కన్వెన్షన్​ లౌఔట్​ను పునరుద్ధస్తుండగా అందులో ప్లాట్​ కలిగి ఉన్న సినీనటి రమ్యశ్రీ తన సోదరుడు ప్రశాంత్​తో అక్కడికి వచ్చింది. అధికారులు మ్యాపింగ్​ చేస్తుండగా ప్రశాంత్​మొబైల్​లో వీడియో తీస్తున్నాడు. అక్కడే ఉన్న సంధ్య కన్వెన్షన్​ఎండీ శ్రీధర్​రావు అనుచరులు వీడియో ఎందుకు తీస్తున్నారంటూ రమ్యశ్రీ, ప్రశాంత్​పై దాడి చేశారు. వారు గచ్చిబౌలి పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.