ఇప్పటికైనా కేసీఆర్ కు ఉద్యోగాల నోటిఫికేషన్స్ గుర్తొచ్చాయి

ఇప్పటికైనా కేసీఆర్ కు ఉద్యోగాల నోటిఫికేషన్స్ గుర్తొచ్చాయి

దుబ్బాక,GHMC లో తగిలిన దెబ్బతోనే ఉద్యోగాల నోటిఫికేషన్స్ సీఎం కేసీఆర్ కు గుర్తొచ్చిందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఇప్పటికైనా ఉద్యోగాలు భర్తీ చేస్తామనడం సంతోషంగా ఉందన్నారు. గ్రేటర్ లో తాగునీరు లేక జనం ఇబ్బంది పడుతున్నారన్నారు. నల్లా నీళ్లు డ్రైనేజీ కలుస్తుంటే కనీసం పట్టియించుకొనే పరిస్తితి కన్పించడం లేదన్నారు. మొన్న కురిసిన వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. హైదరాబాద్ ను ఇస్తాంబుల్ చేస్తామని కేసీఆర్ గొప్పలు చెప్పారన్నారు. చాలా కాలనీలు, బస్తీలు కనీస సౌకర్యాలు నోచుకోకుండా ఉన్నాయని ఆరోపించారు. ఇకనైనా ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాలని డిమాండ్ చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.