పాలేరులో అద్భుతాల మేరీ మాత ఉత్సవాలు షురూ..

పాలేరులో అద్భుతాల మేరీ మాత ఉత్సవాలు షురూ..

కూసుమంచి, వెలుగు : పాలేరులోని అద్భుతాల మేరీ మాత పుణ్యక్షేత్రంలో ఆదివారం ఘనంగా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. పాలేరు పుణ్యక్షేత్రం ఫాదర్ కొమ్ము ఆంటోనీ పర్యవేక్షణలో ముఖ్యఅతిథిగా హాజరైన ఖమ్మం మేత్రాసనం కోశాధికారి రెవరెండ్ ఫాదర్ సురేపల్లి ఐజాక్ పతాకాన్ని ఆవిష్కరించారు. తొలుత మేరీమాత విగ్రహానికి పూలదండలు వేసి ఫాదర్ సూరేపల్లి ఐజాక్ ఉత్సవాల్లో దైవ సందేశాన్ని అందించారు.

ఈనెల 30 వరకు ఉత్సవాలు జరుగనున్నాయి.  28న మేరీమాత ఊరేగింపు, 30న ఉమ్మడి ఖమ్మం జిల్లా బిషప్ డాక్టర్ సగిలి ప్రకాశ్​ ద్వారా  దివ్య బలి పూజ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం లో ఫాదర్ కొమ్ము అంటోనీ, ఫాదర్ జోసెఫ్ కొమరెల్లి, ఫాదర్ లుకాస్, ఆధ్యాత్మిక గీతాల బృందం ఇన్​చా ర్జ్ కొమ్ము ప్రసాద్, మత గురువులు పాల్గొన్నారు.