
ప్రభాస్ కొత్త సినిమా కోసం అతని ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. బాహుబలి, సాహో తర్వాత ప్రభాస్ హీరోగా వస్తున్న మూవీ... రాధేశ్యామ్. అయితే ఈ మూవీ రేపు (మార్చి 11)న విడుదల కానుంది. అయితే ఈ సినిమాపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో రాధే శ్యామ్ సినిమా ఐదో ఆట ప్రదర్శనకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఉదయం 10 గంటల నుంచి అర్థరాత్రి 1 గంట మధ్యలో ఐదో ఆట వేసుకొచ్చని కేసీఆర్ సర్కార్ స్పష్టం చేసింది. ఇప్పటికే తెలంగాణ సర్కార్ భీమ్లా నాయక్ సినిమాకు కూడా ఐదో ఆట వేసుకునే అవకాశం కల్పించింది.
తాజాగా రాధే శ్యామ్ మూవీకి సంబంధించిన ప్రీమియర్స్ను హైదరాబాద్ కూకట్పల్లి థియేటర్స్లో ప్రదర్శించనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇప్పటికే ప్రీమియర్స్ టిక్కెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి. మరోవైపు పీరియాడికల్ బ్యాక్ డ్రాప్లో ఇటలీ నేపథ్యంలో తెరకెక్కిన రాధేశ్యామ్ సినిమా పై ప్రభాస్ అభిమానులకు భారీ అంచనాలే ఉన్నాయి. ఇక రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ రెండు సినిమాలతో ప్రభాస్ క్రేజ్ లోకల్ లెవల్ నుంచి గ్లోబల్ లెవల్కి పెరిగింది. దీంతో రాధేశ్యామ్ మూవీకి పాజిటివ్ టాక్ వస్తే మాత్రం వసూళ్లు అదిరిపోయే అవకాశాలున్నాయి.
ఇవి కూడా చదవండి: