ఫిలింనగర్ భూ వివాదం కేసు: హీరో వెంకటేష్ ఫ్యామిలీ విచారణకు రావాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు

ఫిలింనగర్ భూ వివాదం కేసు:  హీరో వెంకటేష్ ఫ్యామిలీ విచారణకు రావాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు

ఫిలింనగర్ భూ వివాదంపై నాంపల్లి కోర్టులో వాదనలు ముగిశాయి. ఈ కేసులో నటులు వెంకటేష్, దగ్గుపాటి రానా, సురేష్ బాబు తదుపరి విచారణకు హాజరు కవాలని కోర్టు ఆదేశించింది. బుధవారం (సెప్టెంబర్ 10) వాదనలు విన్న కోర్టు.. విచారణను అక్టోబర్ 16 కు వాయిదా వేసింది. 

ఫిలింనగర్లోని తన డెక్కన్ కిచెన్ హోటల్ను అక్రమంగా కూల్చివేశారని నంద కుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.  దగ్గుపాటి రానా, వెంకటేష్, సురేష్ బాబులను ప్రతివాదులుగా చేరుస్తూ నందకుమార్ ఫిర్యాదు చేశారు. ఈ కేసుకు సంబంధించి బుధవారం కోర్టు విచారించింది.

హీరో రానా, వెంకటేష్, సురేష్  తరఫున అడ్వకేట్  కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తదుపరి విచారణకు ముగ్గురు హాజరు కావాల్సిందిగా ఆదేశించిన కోర్టు.. తదుపరి విచారణ అక్టోబర్ 16 కు వాయిదా వేసింది. 

ఏంటి కేసు:

హైదరాబాద్ లోని ఫిలింనగర్ దక్కన్ హోటల్ కూల్చివేతకు సంబంధించి బాధితుడు నంద కుమార్ నాంపల్లి కోర్టుని ఆశ్రయించిన విషయం తెలిసిందే.  2022 నవంబరులో జీహెచ్ఎంసీ సిబ్బంది బౌన్సర్లతో కలిసి హోటల్ ను పాక్షికంగా ధ్వంసం చేశారు. దీంతో బాధితుడు నందకుమార్ అప్పట్లో ఈ విషయంపై కోర్టుని ఆశ్రయించాడు.  కోర్టు విచారణ జరుగుతున్న సమయంలో హోటల్ పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ దగ్గుబాటి కుటుంబ సభ్యులు కోర్ట్ ఆర్డర్స్ లెక్కచెయ్యకుండా 2024 జనవరిలో దక్కన్ హోటల్ ను దౌర్జన్యంతో పూర్తిగా కూల్చి వేశారు. 

దీంతో మరోసారి తనకి న్యాయం చెయ్యాలంటూ నందకుమార్ నాంపల్లి కోర్టుని ఆశ్రయించాడు. ఈ  కేసుని విచారించిన కోర్టు హోటల్ విషయంలో హైకోర్టు ఆర్డర్స్ లెక్కచెయ్యని దగ్గుబాటి కుటుంబంలోని వెంకటేష్, సురేష్ బాబు, రానా, అభిరామ్ తదితరులపై కేసు నమోదు చెయ్యాలని పోలీసులకి ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఈ కేసుని మరింత క్షుణ్ణంగా విచారించాలని ఫిలిం నగర్ పోలీసులకు ఆదేశించింది.