గుడ్ల సప్లయ్‌‌‌‌‌‌‌‌ టెండర్ ఖరారు చేయండి.. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

గుడ్ల సప్లయ్‌‌‌‌‌‌‌‌ టెండర్ ఖరారు చేయండి.. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: అంగన్‌‌‌‌‌‌‌‌వాడీలకు గుడ్ల సరఫరా టెండర్లను వెంటనే ఖరారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్నిహైకోర్టు ఆదేశించింది. టెండర్ల కాలపరిమితిలో రెండున్నర నెలలు గడచిపోయిందని గుర్తుచేసింది. టెండర్ల ఖారారుపై త్వరగా నిర్ణయం తీసుకోవాలంది. 

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్‌‌‌‌‌‌‌‌వాడీలకు గుడ్ల సరఫరాకు మార్చి 30న జారీ చేసిన నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌ ప్రకారం టెండర్లను ఖరారు చేయకపోవడాన్ని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని సిరి ఫామ్స్‌‌‌‌‌‌‌‌ పిటిషన్‌‌‌‌‌‌‌‌ దాఖలు చేసింది. దీనిని జస్టిస్‌‌‌‌‌‌‌‌ పుల్లా కార్తీక్‌‌‌‌‌‌‌‌ గురువారం విచారించారు.  టెండర్‌‌‌‌‌‌‌‌ నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌ ప్రకారం.. ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ 10 ఆఖరు తేదీ అని, దీనిని జూన్‌‌‌‌‌‌‌‌ 16కు పొడిగింపు చెల్లదని పిటిషనర్‌‌‌‌‌‌‌‌ వాదించారు. 

మళ్లీ గడువు పెంపు చేసే అవకాశముందన్నారు. దీనిపై ఏజీ సుదర్శన్‌‌‌‌‌‌‌‌రెడ్డి ప్రతివాదన చేస్తూ.. గుడ్ల సరఫరాకు ప్రత్యేక విధానాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి టెండరు నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌పై దాఖలైన పిటిషన్‌‌‌‌‌‌‌‌ను అనుమతించలేమంటూ తేల్చి చెప్పారు. అయితే టెండరు కాలవ్యవధిలో ఇప్పటికే రెండున్నర నెలలు గడచిపోయినందున..  చట్టప్రకారం వీలైనంత త్వరగా టెండర్ ఖరారు చేయాలని సూచిస్తూ పిటిషన్‌‌‌‌‌‌‌‌పై విచారణను మూసివేశారు.