ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. పరుగులు పెట్టిన పేషెంట్స్

ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. పరుగులు పెట్టిన పేషెంట్స్

హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆపరేషన్ థియేటర్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి.  భారీగా ఎగిసి పడ్డ మంటలతో భయంతో పేషెంట్స్, బంధువులు పరుగు పెట్టారు. ప్రమాద సమయంలో ఐసీయూలో 12 మంది పేషెంట్లు ఉన్నారు.  హుటాహుటిన పేషంట్లను బయటికి హాస్పిటల్ సిబ్బంది తరలించారు.  ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణం నష్టం జరగలేదు. ఆపరేషన్ థియేటర్ సామగ్రి పూర్తిగా ఖాళీ బూడిదైంది. ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలార్పారు.  ఎవరికి ప్రమాదం జరగకపోవడంతో రోగులు, ఆస్పత్రి యాజమాన్యం ఊపిరి పీల్చున్నారు.  ఈ ఘటన బుధవారం (ఆగస్టు 16) చోటుచేసుకుంది.