
- మేడ్చల్ జిల్లాజవహర్ నగర్ లో ఘటన
జవహర్ నగర్ వెలుగు: ఏడేండ్ల బాలుడు కరెంట్ షాక్తో సజీవ దహనమయ్యాడు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పరిధిలోని ప్రగతి నగర్కు చెందిన అనురాజ్ (7) కాలిపోయాడు. స్ప్రింగ్ బెడ్పై పడుకున్న అనురాజన్పై విద్యుత్ వైర్ తెగి పడడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కుటుంబసభ్యులు ఇంట్లో లేని సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి డెడ్బాడీని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.