జీడిమెట్ల పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం

జీడిమెట్ల పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం

కుత్బుల్లాపూర్‌:  జీడిమెట్ల పోలీసు స్టేషన్ పరిధిలోని జీడిమెట్ల పారిశ్రామిక వాడ ఫేజ్ -4లో అగ్నప్రమాదం జరిగింది. ఫేజ్-4లోని హైటెక్ అలుకాస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. అయితే ఈ రోజు ఎన్నికల పోలింగ్ సందర్భంగా సెలవు దినం కావడంతో కార్మికులెవరూ లేరు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలో కంపెనీకి రావడంతో మంటలు అదుపులోకి వచ్చాయి.  ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే సుమారు‌ 5 లక్షల వరకు ఆస్ధి నష్టం జరిగి ఉండొచ్చని కంపెనీ యాజమాన్యం చెబుతోంది.