
హైదరాబాద్ లో అగ్నిప్రమాదం జరిగింది. ముషీరాబాద్ లోని మారుతి షోరూంలో శుక్రవారం అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 7 కార్లు కాలిపోయాయి. స్థానికుల సమాచారంలో ప్రమాద స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది, 4 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. భారీగా ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.