ఖైరతాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో అగ్ని ప్రమాదం

ఖైరతాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో అగ్ని ప్రమాదం

హైదరాబాద్: ఖైరతాబాద్  రైల్వే స్టేషన్  దగ్గర  అగ్ని ప్రమాదం  జరిగింది. ఓ అపార్ట్ మెంట్  పై  ఉన్న సెల్ టవర్ లో  హఠాత్తుగా  మంటలు చెలరేగాయి.  సెల్ టవర్ లో ఉన్న  వైరింగ్  మొత్తం  మంటల్లో కాలిపోయింది.  ఫైర్ సిబ్బంది  వచ్చి మంటలను  అదుపులోకి తెచ్చారు.  దీపావళి  సందర్భంగా  రాకెట్ లాంటిది ఏదైనా  టవర్ కు  తాకి   మంటలు వచ్చి  ఉండొచ్చని  పోలీసులు అనుమానిస్తున్నారు.