రాయదుర్గంలో భారీ అగ్నిప్రమాదం

రాయదుర్గంలో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్ లోని రాయదుర్గంలో  అగ్ని ప్రమాదం జరిగింది. ఓ హోటల్ లో  భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి.హోటల్ రెండో అంతస్తులో మొదలైన మంటలు మూడో అంతస్తులోని సెక్యూరిటీ ఆఫీస్  వరకు వ్యాపించాయి.   హోటల్ పరిసర ప్రాంతం మొత్తం దట్టమైన పొగ అలుముకుంది. భయంతో హోటల్ లో ని జనం బయటకు పరుగులు తీశారు. ఘటనా స్థలానికి వచ్చిన  నాలుగు ఫైర్ ఇంజిన్లు మంటలను ఆర్పుతున్నాయి. ప్రమాద సమయంలో 20 మంది ఉన్నట్లు సమాచారం. మంటల్లో చిక్కుకున్న వారిని  భారీ క్రేన్ల సహాయంతో  కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు అధికారులు. ఇప్పటి వరకు 14 మందిని రక్షించినట్లు పోలీసులు చెప్పారు. ఈ ఘటనలో రాయదుర్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది