సికింద్రాబాద్, వెలుగు : నడుస్తున్న కారు ఇంజన్లోంచి మంటలు చెలరేగి పూర్తిగా దగ్దమైన సంఘటన సికింద్రాబాద్ లోని కంటోన్మెంట్బోర్డు ఆఫీసు సమీపంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. బోయిన్పల్లిలో ఉండే ఓ వ్యక్తి తన స్విఫ్ట్ డిజైర్కారు రేడియేటర్చెడిపోగా బర్కత్ పురాలో రిపేర్చేయించుకుని బోయిన్పల్లికి వెళ్తున్నాడు. రాత్రి 7 గంటల సమయంలో సికింద్రాబాద్వైఎంసీఏ వద్దకు రాగా కారు ఇంజన్లో నుంచి పొగలు వస్తున్నాయి. వాహనదారులు చూసి కారు నడుపుతున్న వ్యక్తికి చెప్పారు.
వెంటనే ఆయన యూ-టర్న్ తీసుకుని కంటోన్మెంట్బోర్డు ఆఫీసు ఎదురుగా ఆపేలోపే కారు ఇంజన్నుంచి పెద్ద ఎత్తున మంటలు లేవడగా వెంటనే ఆయన దిగిపోయాడు. అప్పటికే కారు ముందు భాగం నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగి మొత్తం వ్యాపించాయి. ట్రాఫిక్ పోలీసులు వెంటనే ఫైర్సిబ్బందికి సమాచారం అందించగా వచ్చి మంటలను ఆర్పారు. అప్పటికే కారు పూర్తిగా దగ్దమైంది. కారులో తన సెల్ఫోన్, కొంత డబ్బు, ఇతర వస్తువులు కాలిపోయినట్లు ఓనర్ చెప్పాడు. అయితే తన పేరు చెప్పేందుకు బాధితుడు ఇష్టపడలేదు.