అబ్దుల్లాపూర్మెట్, వెలుగు : అక స్మాత్తుగా మంటలు అంటుకోవడంతో టీఎస్ ఆర్టీసీకి చెందిన ఏసీ బస్సు పూర్తిగా దగ్ధమైంది. శుక్రవారం తెల్లవారు జామున హైదరాబాద్ నుంచి గుంటూరుకు 45 మంది ప్యాసింజర్లతో ఏసీ బస్సు బయలుదేరింది.
పెద్ద అంబర్పేట ఔటర్ రింగ్ రోడ్డు ప్రాంతానికి రాగానే బస్సులోని ఏసీలో మంటలు చెలరేగాయి. అది గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును రోడ్డు పక్కన ఆపేసి ప్యాసింజర్లను దింపేశాడు. అందరూ దిగేలోపే బస్సు పూర్తిగా మంటల్లో కాలిపోయింది.
ఏసీలో నుంచి మంటలు రావడంతోనే ప్రమాదం చోటు చేసుకుందని ప్రయాణికులు వెల్లడించారు. డ్రైవర్ అప్రమత్తత వల్లే అందరూ ప్రమాదం నుంచి బయటపడ్డారని పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.