రజనీకాంత్ కూలీ చిత్ర షూటింగ్ పరిసర ప్రాంతంలో మంటలు..

రజనీకాంత్ కూలీ చిత్ర షూటింగ్ పరిసర ప్రాంతంలో మంటలు..

ప్రస్తుతం ప్రముఖ హీరో రజనీకాంత్ కూలీ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. కాగా ఈ చిత్రానికి ప్రముఖ తమిళ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ చిత్రం ప్రస్తుతం విశాఖ పట్టణంలోని పోర్ట్ పరిసర ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటోంది. 

కాగా తాజాగా పోర్ట్ లో లోడింగ్ పూర్తీ చేసుకుని చైనాకి వెళ్ళవలసిన ఓ చైనీస్ ఓ కంటైనర్ లో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో కంటైనర్ మరియు వస్తువులు దగ్దమై మంటలు చుట్టుప్రక్కలకి వ్యాపించసాగాయి. దీంతో వెంటనే అప్రమత్తయిన  చిత్ర యూనిట్ సభ్యులు షూటింగ్ నిలిపివేసి మంటలు చెలరేగిన పరిసరాలను ఖాళీ చేసే ప్రయత్నం చేసారు. అయితే షూటింగ్ జరుగుతున్న సమయంలో రజనీకాంత్ షూటింగ్ స్థలంలో లేనట్లు తెలుస్తోంది. 

ALSO READ | అలా చేసినందుకు ఫ్యాన్స్ కి సారీ చెప్పిన స్టార్ నటి..

ఈ విషయం ఇలా ఉండగా ఆ మధ్య రజనీకాంత్ హీరోగా నటించిన జైలర్ చిత్రంలో కన్నడ, మలయాళం, హిందీ సినీ పరిశ్రమలకి చెందిన శివ రాజ్ కుమార్, మోహన్ లాల్, జాకీ ష్రాఫ్ తదితర స్టార్ హీరోలు గెస్ట్ అప్పీయరెన్స్ పాత్రలో నటించగా జైలర్ చిత్రం విడుదల చేసిన అన్ని భాషల్లో మంచి విజయం సాధించింది.  

దీంతో కూలీ చిత్రంలో కూడా ఇదే ఫార్ములా అప్లయ్ చేస్తున్నారు లోకేష్ కనకరాజ్. ఈ క్రమంలో కూలీ చిత్రంలో టాలీవుడ్ ప్రముఖ హీరో నాగార్జున, ఉపేంద్ర, శివకార్తికేయన్ తదితరులను గెస్ట్ అప్పీయరెన్స్ పాత్రలో నటింపజేస్తున్నారు.  మరి జైలర్ చిత్రం ఫార్ములా కూలీ చిత్రానికి వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి.