జహీరాబాద్ శివారులో కాల్పుల కలకలం

జహీరాబాద్ శివారులో కాల్పుల కలకలం

సంగారెడ్డి జిల్లా : జహీరాబాద్ మండలం గోవింద్ పూర్ గ్రామశివారులో కాల్పులు కలకలం రేపాయి. 31ఎకరాల భూవివాదంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. గోవింద్ పూర్ శివారులో కమల్ కిశోర్ పలాడ్ అనే వ్యక్తి తన భూమిలో కూలీలతో పనులు చేపట్టాడు. ఇది తెలుసుకున్న అలీ అక్బర్, అష్రఫ్ వచ్చి గొడవకు దిగారని చెప్పారు పోలీసులు. ఆ గొడవ పెద్దది కావడంతో అక్బర్, అష్రఫ్ ఓ రౌడీషీటర్ ను పిలిపించారని.. అతడు ఆరు రౌండ్ల కాల్పులు జరిపాడని చెప్పారు పోలీసులు. అలీ అక్బర్, అష్రఫ్ ను అదుపులోకి తీసుకున్నామని.. కాల్పులు జరిపిన వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు డీఎస్పీ శంకర్ రాజు. అక్బర్, అష్రఫ్ ల్యాండ్.. కిశోర్ పలాడ్ భూమి పక్కనే ఉంటుందని చెప్పారు.