కల్లంలో ఉన్నపంటకు నిప్పు

కల్లంలో ఉన్నపంటకు నిప్పు

వికారాబాద్ జిల్లా పరిగి మండలం బసిరెడ్డిపల్లిలో కల్లంలో ఉన్నపంటకు నిప్పుపెట్టారు దుండగులు. బీరయ్య అనే రైతు మొక్కజొన్న పంట వేశాడు. కల్లంలో ఉన్న పంటకు రాత్రి నిప్పుపెట్టారు గుర్తుతెలియని వ్యక్తులు.  పంట కాలిపోవడం గుర్తించిన స్థానికులు ఫైర్ స్టేషన్ కు ఫోన్ చేశారు.  ఫైర్ ఇంజిన్ వచ్చే లోపే పంట పూర్తిగా కాలిపోయింది.నాలుగు ఎకరాల పొలం కౌలుకు తీసుకొని పంట వేశానని..ఎవరో కావాలనే నిప్పుపెట్టారని రైతు బీరయ్య ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు రెండు లక్షల పంట అగ్నికి ఆహుతైందన్నారు. రైతు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.