
మెహిదీపట్నం, వెలుగు: ఫర్నిచర్ గోదాములో అగ్నిప్రమాదం జరగగా, 13 మంది కార్మికులను ఫైర్ సిబ్బంది కాపాడారు. ఆసిఫ్ నగర్ జిర్రా ప్రాంతంలో ఎన్నారైకు చెందిన జి ప్లస్ ఫోర్ భవనం ఉండగా, ఓ వ్యక్తి అద్దెకు తీసుకొని మొదటి అంతస్తులో ఫర్నిచర్ గోదామ్, పైఅంతస్తుల్లో మ్యానుఫ్యాక్చరింగ్ స్క్రాప్ నిలువ ఉంచాడు.
షార్ట్ సర్క్యూట్ కారణంగా గ్రౌండ్ ఫ్లోర్లోని షాపులో మంటలు చెలరేగగా, అందులో పనిచేసే 13 మంది కార్మికులు ఆహాకారాలతో నాలుగో అంతస్తుకు పరుగులు తీశారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది రాడార్ నిచ్చెనల సాయంతో కార్మికులను సురక్షితంగా కిందకు దింపారు. దట్టమైన పొగలో స్పృహ కోల్పోయిన వారిని భుజాలపై మోసి కాపాడిన అగ్నిమాపక సిబ్బందిని స్థానికులు అభినందించారు.