తిరుమల కొండల్లో చెలరేగిన మంటలు..

తిరుమల  కొండల్లో చెలరేగిన మంటలు..

తిరుమల శేషాచల కొండల్లో అగ్ని ప్రమాదం జరిగింది. శిలాతోరణం,   శ్రీవారి పాదాలకు వెళ్లే దారిలో అటవీ  ప్రాంతంలో జూన్ 10న ఉదయం  మంటలు ఎగిసిపడ్డాయి. 100 మీటర్ల మేర అడవి అగ్నికి ఆహుతి అయ్యింది.  

స్థానికుల సమాచారంతో  ఘటనా స్థలానికి వచ్చిన ఫైర్ సిబ్బంది, టీటీడీ అధికారులు  మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.. ఆ రూట్ లో వెళ్లే భక్తులు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదం వెనుక ఏదైనా కుట్ర ఉందా? లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనేది తెలియాల్సి ఉంది.

ALSO READ | తప్పులు ఎత్తిచూపితే అక్రమ కేసులా.. ? మీకు కూడా ఇదే రిపీట్ అవుతుంది: మాజీ మంత్రి రోజా

మే 1న కూడా తిరుమలలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. తిరుమల నుంచి పాప వినాశనం మార్గంలో  అటవీ ప్రాంతంలో  మంటలు భారీ ఎత్తున ఎగిసి పడ్డాయి. వెంటనే గుర్తించిన టీటీడీ ఫారెస్ట్  అధికారులు అప్రమత్తమై మంటలను అదుపు చేశారు.