
కూటమి ప్రబుత్వం పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి రోజా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందని.. హోమ్ మంత్రికి చీమ కుట్టినట్లు కూడా లేదని అన్నారు.అధికారంలో ఉన్నవాళ్లు లా అండ్ ఆర్డర్ కాపాడాలి కానీ..అధికారంలో ఉన్నవాళ్లు వారే రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు రోజా. తప్పులు ఎత్తిచూపితే అక్రమ కేసులు పెడుతున్నారని.. రాబోయే రోజుల్లో మీకు కూడా ఇదే పరిస్థితి వస్తుందని అన్నారు రోజా. మహిళ హోం మంత్రిగా ఉన్న రాష్ట్రంలో మహిళలు పై దారుణాలు జరగడం సిగ్గుచేటు అని అన్నారు.
నగరి నియోజకవర్గం లో మైనర్ బాలికపై అత్యాచారం చేశారని..అనంతపురం జిల్లా ఇంటర్ విద్యార్ధి కనిపించకపోతే పట్టించుకోలేదని అన్నారు. పరిటాల సునీత నియోజకవర్గంలో 14 మంది టీడీపీ వాళ్లు మైనర్ బాలికపై అత్యాచారం చేస్తే సాక్షి మీడియా బయటకు తీసుకు వచ్చిందని అన్నారు రోజా. డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ మహిళలు పై దాడులు జరుగుతుంటే పట్టించుకోవడం లేదని అన్నారు.హోం మంత్రి అనిత నా చేతిలో గన్ ఉందా, నాకు పవర్ ఉందా.. అంటూ చేతకాని మాటలు మాట్లాడుతూ ఉంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని గారిని తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేశారని.. కొమ్మినేని శ్రీనివాసరావు గారి పై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం దారుణమని అన్నారు. క్షమాపణ అంటూ చెప్పాల్సి వస్తే మొదటగా చంద్రబాబు చెప్పాలని, ఆడబిడ్డ పుట్టుక గురించి తప్పుగా మాట్లాడిన చంద్రబాబు క్షమాపణ చెప్పాలని,ఆడపిల్ల కనిపిస్తే ముద్దు పెట్టాలి, లేదంటే కడుపున చేయాలి అని మాట్లాడిన బాలకృష్ణ పై కేసు పెట్టాలి అన్నారు ఆయనపై కేసు పెట్టాలని అన్నారు రోజా. జగన్ అన్న లండన్ వెళ్తే తప్పుడు వాఖ్యలు చేసిన నారా లోకేష్ పై ముందు కేసు పెట్టాలని అన్నారు.
►ALSO READ | బనకచర్లపై ఏపీ, కేంద్రం కొత్త ఎత్తుగడ! గోదావరి-కావేరి లింక్ను గోదావరి-సోమశిల-కావేరి లింక్ గా మార్చే కుట్ర
మూర్తి, రేణుక చౌదరి మాట్లాడిన మాటలు పై ఎందుకు కేసు నమోదు చేయాలేదని ప్రశ్నించారు. బి.ఆర్.నాయుడు పై ఎందుకు కేసు పెట్టలేదని అన్నారు. కొమ్మినేని శ్రీనివాసరావు పై ఎప్పటి నుంచో కక్ష గట్టి చంద్రబాబు అరెస్ట్ చేయించారని అన్నారు. జూన్ 6 తేదీ డిస్కషన్ జరిగిందని, కొమ్మినేని గారు క్షమాపణ కూడా చెప్పారని అన్నారు. లోకేశ్, చంద్రబాబు సోషల్ మీడియా ద్వారా విష ప్రచారం చేశారని మండిపడ్డారు రోజా.
ఒక పథకం ప్రకారం యాక్షన్ ప్లాన్ తో సాక్షి పైన, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పై బురద జల్లారని.. ప్రజలకు ఇచ్చిన హామీలు గాలికి వదిలేసిన కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ పాల్పడుతోందని అన్నారు రోజా.వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో ప్రతి మహిళకు మంచి చేయాలని, గౌరవం పెంచాలని సంక్షేమ పాలన అందించారని అన్నారు రోజా.