మినీ వోల్వో బస్సులో మంటలు

మినీ వోల్వో బస్సులో మంటలు

శంషాబాద్ రూరల్ పీఎస్ పరిధిలోని ఓఆర్ఆర్ పై మినీ వోల్వో బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓఆర్ఆర్ పై నుంచి మొయినాబాద్ వైపు వెళ్తున్న మినీ వోల్వో బస్సులో చిన్న గోల్కొండ గ్రామం వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీన్ని గమనిం చిన డ్రైవర్ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. మంటలు చెలరేగిన సమయంలో బస్సులో ప్యాసింజర్లు లేరని స్థానికులు తెలిపారు. పెట్రోలింగ్ పోలీసులు ఘటనా స్థలా నికి చేరుకొని శంషాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఫైరింజన్ సిబ్బంది వచ్చి మంటలను పూర్తిగా ఆర్పివేశారు. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదని కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్టు శంషాబాద్ రూరల్ సీఐ ప్రకాష్ రెడ్డి తెలిపారు.