పాలమూరులో తొలి కరోనా కేసు నమోదు

పాలమూరులో  తొలి కరోనా కేసు నమోదు

పాలమూరు, వెలుగు: ఉమ్మడి మహబూబ్​నగర్  జిల్లాలో తొలి కరోనా కేసు నమోదైనట్లు మహబూబ్​నగర్  జనరల్  హాస్పిటల్​ సూపరింటెండెంట్ డాక్టర్  జీవన్  తెలిపారు. మంగళవారం 14 మంది అనుమానితులకు ఆర్టీపీసీఆర్​ పరీక్షలు చేయగా, అందులో 20 ఏండ్ల యువకుడికి పాజిటివ్ వచ్చిందని చెప్పారు.

 ప్రస్తుతం యువకుడిని హోమ్  ఐసోలేషన్ లో ఉంచామని, స్వల్ప లక్షణాలు ఉండడంతో ఇలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. ప్రజలు గుంపులు గుంపులుగా ఉండవద్దని, కోవిడ్  జాగ్రత్తలు పాటించాలన్నారు