- ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు
- కొన్నిచోట్ల మొరాయించిన ఈవీఎంలు
- వెంటనే రీప్లేస్ చేసిన ఎన్నికల కమిషన్
అహ్మదాబాద్ : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఫస్ట్ ఫేజ్లో 89 స్థానాలకు గురువారం జరిగిన పోలింగ్ ప్రశాతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల దాకా 59.20 శాతం ఓటింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు తెలిపారు. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 19 జిల్లాల్లోని అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయని, కొన్ని సెంటర్స్లో ఈవీఎంలు మొరాయించడంతో వెంటనే రీప్లేస్ చేసినట్టు ప్రకటించారు. ట్రైబల్స్ ఎక్కువగా ఉన్న తాపి, నర్మదా జిల్లాల్లో 65 శాతానికి పైగా ఓటింగ్ రికార్డయ్యిందని తెలిపారు. భావ్నగర్లోని పాలిటానాలో రెండు రాజకీయ పార్టీల లీడర్ల మధ్య స్వల్ప ఘర్షణ మినహా పోలింగ్ పీస్ఫుల్గా కంప్లీట్ అయినట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. తమకు ప్రత్యేక బూత్లేదని జామ్నగర్ జిల్లాలోని జామ్జోధ్పూర్ పోలింగ్ స్టేషన్లో మహిళలు నిరసన తెలిపారు. జునాగఢ్లో కాంగ్రెస్ కార్యకర్త తన భుజంపై సిలిండర్పెట్టుకుని పోలింగ్ స్టేషన్ వైపు వెళ్తుండగా.. పోలీసులు అతన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించగా గొడవ జరిగింది. కాంగ్రెస్ లీడర్ పరేశ్ ధనాని సైకిల్పై గ్యాస్ సిలిండర్తో పోలింగ్ స్టేషన్కు పెళ్లారు. బీజేపీలో పాలనలో ధరలు పెరిగాయంటూ నిరసన తెలిపారు. 33 బ్యాలెట్ యూనిట్స్, 29 కంట్రోల్ యూనిట్స్, 69 వీవీ ప్యాట్లను ఈసీ రీప్లేస్ చేసింది.
జామ్నగర్లో ఓటేసిన జడేజా కపుల్
ఉమర్గాంలోని పోలింగ్ స్టేషన్కు వెళ్లి 100 ఏండ్ల కాముబెన్ లాలాభాయ్ పటేల్ ఓటేసింది. 104 ఏండ్ల రామ్జీ భాయ్ పోస్టల్బ్యాలెట్ ఎంచుకోకుండా పోలింగ్ స్టేషన్కెళ్లి ఓటేసినట్టు ఈసీ తెలిపింది. ఇండియన్ క్రికెటర్ రవీంద్ర జడేజా, ఆయన సతీమణి రివబ జడేజా జామ్నగర్లోని ఓ పోలింగ్ స్టేషన్కు వెళ్లి ఓటేశారు. రవీంద్ర జడేజా భార్య జామ్నగర్ నార్త్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తుంటే.. ఆయన తండ్రి అనిరుధ్ సిన్హ్ జడేజా మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ప్రచారం చేశారు. కుమార్తె నైనా జడేజాతో కలిసి జామ్నగర్లోని ఓ పోలింగ్ స్టేషన్లో ఓటేశారు. బీజేపీ సీనియర్ లీడర్, మాజీ సీఎం విజయ్ రూపానీ, స్టేట్ బీజేపీ చీఫ్ సీఆర్ పాటిల్, రాజ్యసభ సభ్యుడు పరిమల్ నథ్వానీ, మాజీ కాంగ్రెస్ అపోజిషన్ లీడర్ పరేశ్ ధనానీ, ఆప్ స్టేట్ చీఫ్ గోపాల్ ఇటాలియాలు ఫస్ట్ ఫేజ్లో భాగంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
పెండ్లి బట్టల్లోనే ఓటేశారు..
కవిత, వైభవ్లు పెండ్లి చేసుకుని మండపం నుంచి డైరెక్ట్గా పోలింగ్ బూత్కు వెళ్లి ఓటేశారు. కచ్ జిల్లా భుజ్ అసెంబ్లీ నియోజకవర్గంలోని 208 పోలింగ్ సెంటర్లో ఈ న్యూ కపుల్స్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.