వైజాగ్: మామూలుగా చేపలు 3-5 కిలోలు ఉంటడం కామన్. సముద్రంలో అయితే 10 నుంచి 20 కిలోలున్న చేపలను మనం చూసే ఉంటాం. అయితే శుక్రవారం వైజాగ్ సముద్రంలో మత్య్సకారులకు భారీ చేప దొరికింది. ఈ చేప 185 కిలోల బరువుంది. దీన్ని స్థానిక వ్యాపారులు రూ.30 వేలకు కొనుగోలు చేశారు. ఈ చేపను కేరళకు ఎగుమతి చేయనున్నట్టు వారు తెలిపారు. ఈ భారీ మీనాన్ని చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపారు.
సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు చిక్కిన భారీ ‘బొంతు’ చేపను శుక్రవారం విశాఖపట్నం ఫిషింగ్హార్బర్లో విక్రయించామని తెలిపారు వ్యాపారి.