హెచ్చార్సీకి మత్స్యకార కుటుంబాల ఫిర్యాదు
హైదరాబాద్,వెలుగు: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం ఆలూరు గ్రామానికి చెందిన మత్స్యకార కుటుంబాలు మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించాయి. ఆలూరు గ్రామంలో నివాసం ఉంటున్న తమను15 నెలలుగా కులం నుంచి వెలి వేసి వేధిస్తున్నారని మూడు కుటుంబాలకు చెందిన మత్స్యకారులు శనివారం హెచ్ఆర్సీలో పిటీషన్ దాఖలు చేశారు. మత్స్య అభివృద్ధి పథకం కింద మంజూరైన వాహనాల విషయంలో తలెత్తిన వివాదంతో ఇలా చేశారని ఆరోపించారు. బాధితుల ఫిర్యాదును స్వీకరించిన కమిషన్ సమగ్ర విచారణ జరిపి ఆగస్ట్ 3వ తేదీలోపు
రిపోర్ట్ ఫైల్ చేయాలని నిజామాబాద్ సీపీని ఆదేశించింది.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి