ఒకేరోజు ఐదుగురు ఫారెస్ట్ ​ఆఫీసర్ల సస్పెన్షన్​

ఒకేరోజు ఐదుగురు ఫారెస్ట్ ​ఆఫీసర్ల సస్పెన్షన్​

జన్నారం, కాగజ్​నగర్, వెలుగు: ఉమ్మడి ఆదిలాబాద్ ​జిల్లాలో ఒకే రోజు ఐదుగురు ఫారెస్ట్​ఆఫీసర్లు సస్పెండ్ అయ్యారు. ఇటీవల కలప తరలింపులో వీరి హస్తం ఉన్నట్లు తేలడంతో ఉన్నతాధికారులు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. ఈ నెల 3న  జన్నారం ఫారెస్ట్​ రేంజ్​పరిధిలోని చింతగూడ బీట్​లో నిల్వ ఉంచిన  రూ.46 వేల విలువైన కలపను ఫారెస్ట్​ ఆఫీసర్లు స్వాధీనం చేసుకున్నారు. కలప స్మగ్లర్లకు ఎవరు సహకరిస్తున్నారనే దానిపై జిల్లా ఫ్లయింగ్​స్క్వాడ్​ఆఫీసర్లు విచారణ జరిపారు. జన్నారం టైగర్​జోన్​ పరిధిలోని ఆసిఫాబాద్​డివిజన్​గిన్నెదరి రేంజ్​లోని దొంగపెల్లి 2 సెక్షన్​ఆఫీసర్​వినయ్ కుమార్, మల్యాల 2 సెక్షన్​ఆఫీసర్​ రవికుమార్​తో పాటు సింగరాయిపేట, చింతగూడ బీట్​ఆఫీసర్లు లక్ష్మన్, మక్బూల్​డ్యూటీలో పూర్తిగా నిర్లక్ష్యం వహించారని తేలింది. ఎఫ్​డీపీటీ వినోద్​కుమార్​ ఆదేశానుసారం నలుగురిని  సస్పెండ్​ చేసినట్లు జన్నారం ఎఫ్ డీఓ మాధవరావు  తెలిపారు. బెజ్జూరు మండల కేంద్రంలో ఓ ఇంట్లో కలప నిల్వ చేసిన ఘటనలో బాధ్యుడైన సలుగుపాల్లి సెక్షన్ ఆఫీసర్ పోశెట్టిని సస్పెండ్​ చేశారు.

 

five Forest Officers Suspended in Adilabad district in One day