- మద్యం మత్తులో యువకుల హల్చల్ ఐదుగురికి గాయాలు
వైరా, వెలుగు: ఖమ్మం జిల్లా వైరాలో మద్యం మత్తులో కత్తులు, కర్రలతో దాడి చేసుకున్నారు. వైరాకు చెందిన యూసఫ్ఖాన్(23) అలియాస్ ఖాన్భాయ్వైరా బ్రాహణపల్లిలో ఉంటున్నాడు. తన బర్త్డే వేడుకలంటూ వైరా రిజర్వాయర్ పక్కన విందు ఏర్పాటు చేశాడు. ఫుల్గా మద్యం తాగి తన ఫ్రెండ్స్తో బ్రాహ్మణపల్లి స్కూల్వద్దకు వచ్చి వీరంగం సృష్టించారు. అక్కడ కనిపించిన వారిపై దాడి చేయడంతో ఐదుగురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు 12 మందిపై కేసు నమోదు చేశారు.