తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుప్పూర్ జిల్లా అవినాసి దగ్గర కారు,లారీ ఢీ కొన్నాయి. ఈ ఘటనలోఐదు మంది మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డవారిని కొయంబత్తూర్ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారిలో నలుగురు మెడికో విద్యార్థులు, కారు డ్రైవర్ ఉన్నారు. మృతులు సేలంలోని వినాయకపుర మెడికల్ కాలేజి మెడికో విద్యార్థులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
see more news
ఓపెన్ ప్లేస్ లో ఉమ్మితే రూ.1000 ఫైన్