గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి

గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి

గుంటూరు జిల్లాలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫిరంగిపురం మండలం రేపూడి దగ్గర ఆటో, లారీ ఢీకొని ఐదుగురు చనిపోయాయి. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. నరసరావుపేట నుంచి ఫిరంగిపురం వైపు వస్తున్న ఆటోను, ఫిరంగిపురం నుంచి నరసరావుపేట వైపు వెళ్తున్న మినీ లారీ ఢీకొట్టింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.