పంజాబ్​ ఫ్యాక్టరీలో పేలుడు.. ఐదుగురు మృతి.. 30 మందికి గాయాలు

పంజాబ్​ ఫ్యాక్టరీలో పేలుడు.. ఐదుగురు మృతి.. 30 మందికి గాయాలు

చండీగఢ్: పంజాబ్‌‌‌‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పటాకుల తయారీ యూనిట్‌‌‌‌లో పేలుడు సంభవించి ఐదుగురు మరణించారు. మరో 30 మంది గాయపడ్డారు. పంజాబ్ -హర్యానా సరిహద్దులో శ్రీ ముక్త్‌‌‌‌సర్ సాహిబ్ జిల్లాలోని సింగేవాలా-కోట్లి రోడ్డులో లంబి గ్రామానికి దగ్గర్లో ఉన్న రెండు అంతస్తుల ఫ్యాక్టరీ యూనిట్‌‌‌‌లో శుక్రవారం తెల్లవారుజామున ఒంటి గంట ప్రాంతంలో ఈ పేలుడు సంభవించిందని పోలీసులు తెలిపారు. 

పేలుడు తీవ్రతకు భవనం పైకప్పు ఇతర భాగాలు కూలిపోయాయని పేర్కొన్నారు. ఘటనకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే పోలీసులు స్పాట్​కు చేరుకొని శిథిలాల కింద చిక్కుకున్నవారిని రక్షించారు. పటాకుల తయారీలో ఉపయోగించిన పదార్థాల వల్లే పేలుడు సంభవించినట్టు తెలుస్తోందని వారు పేర్కొన్నారు.