చిన్నారి ప్రాణం తీసిన చైనా మాంజా.. హైదరాబాద్ కూకట్‌‌‌‌పల్లిలో విషాద ఘటన

చిన్నారి ప్రాణం తీసిన చైనా మాంజా.. హైదరాబాద్ కూకట్‌‌‌‌పల్లిలో విషాద ఘటన

కూకట్‌‌‌‌‌‌‌‌పల్లి, వెలుగు: చైనా మాంజా మెడకు చుట్టుకొని ఐదేండ్ల బాలిక మృతి చెందింది. ఈ  విషాద ఘటన హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని కూకట్‌‌‌‌‌‌‌‌పల్లి వివేకానందనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగింది. కూకట్‌‌‌‌‌‌‌‌పల్లి పోలీసులు ఈ  వివరాలను వెల్లడించారు. కూకట్‌‌‌‌‌‌‌‌పల్లి గోకుల్​ప్లాట్స్‌‌‌‌‌‌‌‌లో నివసించే రామసాగర్​ ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ ఉద్యోగం చేస్తుంటాడు. ఇతను పటాన్​చెరు సమీపంలోని ఖాజిపల్లిలో కొంతకాలం క్రితం ఇంటిని కొనుగోలు చేశాడు.

ఆ ఇంటి వద్ద జరుగుతున్న ఇంటీరియర్​ పనులను చూసేందుకు సోమవారం ఉదయం కుటుంబంతో కలిసి బైక్‌‌‌‌‌‌‌‌పై  ఖాజిపల్లికి వెళ్లారు. వీరు సాయంత్రం తిరిగి ఇంటికి వస్తున్నారు. పటాన్​చెరు నుంచి కూకట్‌‌‌‌‌‌‌‌పల్లి వైపు వస్తున్న వీరు నేరుగా ఇంటికి వెళ్లకుండా కేపీహెచ్‌‌‌‌‌‌‌‌బీ కాలనీ వద్ద నగల దుకాణానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

ఆ షాప్‌‌‌‌‌‌‌‌ దాటి బైక్​ ముందుకు వెళ్లడంతో వివేకానందనగర్​కాలనీ సమీపంలో యూటర్న్​ తీసుకునేందుకు బైక్‌‌‌‌‌‌‌‌ను రామసాగర్​ ముందుకు పోనిచ్చాడు. సాయంత్రం 4 గంటల సమయంలో వీరు కూకట్‌‌‌‌‌‌‌‌పల్లి వివేకానందనగర్​కాలనీ మెట్రో పిల్లర్​ నెంబర్​ 781 వద్దకు వచ్చిన సమయంలో బైక్ పైన తండ్రి​ ముందు కూర్చున్న నిష్వికదరియా(5) సడెన్‌‌‌‌‌‌‌‌గా ఏడ్వడం మొదలుపెట్టింది. 

వెంటనే బైక్‌‌‌‌‌‌‌‌ను పక్కకు ఆపిన తండ్రి రామసాగర్..​ కూతురు మెడకు చైనా మాంజా త్రెడ్​ చుట్టుకొని రక్తం కారుతుండటం గమనించాడు. వెంటనే చిన్నారిని సమీపంలోని ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ దవాఖానకు  తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిష్వికదరియా అధిక రక్తస్రావం కావటంతో మృతి చెందింది.  కూకట్​పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.