కూకట్పల్లి, వెలుగు: కూకట్పల్లిలోని అంకుర హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఐదేండ్ల బాలిక మృతి చెందింది. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ ప్రాణం పోయిందంటూ తల్లిదండ్రులు ఆసుపత్రి ముందు ఆందోళకు దిగారు. వారి వివరాల ప్రకారం.. కూకట్పల్లికి చెందిన ఐదేండ్ల వర్షిణి ఫిట్స్తో బాధపడుతుండటంతో వారం కింద తల్లిదండ్రులు అంకుర ఆసుపత్రిలో చేర్పించారు. వారం రోజులుగా చికిత్స అందిస్తున్నామని చెబుతూ సుమారు రూ. 4 లక్షల వరకు ఫీజులు వసూలు చేశారు.
సోమవారం ఒక్కసారిగా వచ్చి పాప ‘బ్రెయిన్ డెడ్’ అయిందని చెప్పడంతో తల్లిదండ్రులు షాక్కు గురయ్యారు. దీంతో వైద్యం వికటించడం వల్లే తమ కూతురు చనిపోయిందని ఆరోపిస్తూ బాధితులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. అయితే, ఈ ఘటనపై తమకు ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని కూకట్పల్లి పోలీసులు తెలిపారు.

