ఊరు మొత్తాన్ని ఊడ్చేసిన బురద నీరు.. ఉత్తరకాశిలో కొండ కింద ప్రళయం..

ఊరు మొత్తాన్ని ఊడ్చేసిన బురద నీరు.. ఉత్తరకాశిలో కొండ కింద ప్రళయం..

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశి జిల్లా ధరాలి గ్రామంలో మంగళవారం కొండచరియలు విరిగిపడటంతో వరదలు ఒక్కసారిగా ముంచుకొచ్చాయి, దీంతో గ్రామంలోని సగానికి పైగా ఇళ్లులు తుడిచిపెట్టుకుపోయాయి. ఈ  భయంకరమైన వీడియోలో వరద నీటి అలలు బలంగా ఇళ్లను ఒక్కసారిగా ముంచెత్తుతుండటంతో ప్రజలు కేకలు వేస్తుండటం చూడొచ్చు. ప్రస్తుతం ఈ వీడియోలు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి.

 

ఈ వరదల వల్ల భారీగా ఆస్తి నష్టం జరగ్గ, శిథిలాల కింద ప్రజలు చిక్కుకొని ఉండొచ్చని  భావిస్తున్నారు. ఎస్డీఆర్ఎఫ్ రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకోగ, ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా రెస్క్యూ ఆపరేషన్ కోసం భారత సైన్యాన్ని రంగంలోకి దింపింది.

ALSO READ : 20 ఏళ్ల కుర్రోడు.. రాత్రికి రాత్రి అంబానీ కంటే రిచ్ అయ్యాడు : మన ఇండియాలోనే..!

ఖిర్ గంగా నదిలో నీటి మట్టాలు పెరగడం వల్ల ధరాలిలో వరదలు పొంగాయని సమాచారం. హర్సిల్ నుండి ఆర్మీ యూనిట్లు, పోలీసులు, SDRF బృందాలను భట్వారీకి పంపించినట్లు అధికారులు తెలిపారు. ఈ దారుణ ఘటనపై రాష్ట్ర మంత్రి సౌరభ్ బహుగుణ విచారం వ్యక్తం చేస్తూ శిథిలాలలో చిక్కుకున్న వారి ప్రాణాలను కాపాడటమే ప్రభుత్వ ప్రాధాన్యత అని అన్నారు.