వరంగల్ లో టీఆర్ఎస్, బీజేపీ ఫ్లెక్సీల రగడ

వరంగల్ లో టీఆర్ఎస్, బీజేపీ ఫ్లెక్సీల రగడ

వరంగల్ లో టీఆర్ఎస్, బీజేపీ ఫ్లెక్సీల రగడ కొనసాగుతోంది. బండి సంజయ్ చెప్పులు మోసినట్లు రాత్రికి రాత్రే వివిధ సర్కిళ్లలో టీఆర్ఎస్ కార్యకర్తలుఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలను  బీజేపీ నేతలు చించివేశారు. టీఆర్ఎస్ నేతలను కావాలనే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. చిల్లర వేషాలు వేస్తే తగిన గుణపాఠం చెబుతామని బీజేపీ నేతలు హెచ్చరించారు.

ఇటీవల తెలంగాణ పర్యటనలో భాగంగా అమిత్ షా హైదరాబాద్ విచ్చేసిన విషయం విధితమే. ఈ సమయంలో అమిత్ షాకు బండి సంజయ్ చెప్పులు అందించే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మంత్రి కేటీఆర్ తో పాటు, పలువురు టీఆర్ఎస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై   బండి సంజయ్ కూడా వివరణ ఇచ్చారు. అమిత్ షాకు చెప్పులందివ్వడం అంత పెద్ద ఇష్యూనా అన్న ఆయన.. తమకు అమిత్ షా ఆదర్శ నేత అని, అలాంటి ఆయనకు చెప్పులందివ్వడం పెద్ద విషయమేం కాదని చెప్పారు. ఈ క్రమంలోనే తాము గులాములు కాదని, మజ్లిస్‌కు సలాం కొట్టే వారసులు అసలే కాదని ఆయన వ్యాఖ్యానించారు.