బెంగళూరు : వాల్మార్ట్కు చెందిన దేశీయ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్, ఇండియన్ గ్రోసరీ చైన్ నామ్ధారి ఫ్రెష్ను కొనుగోలు చేయబోతోంది. ఈ కొనుగోలుపై ఇరు వర్గాల మధ్య చర్చలు జరుగుతున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. నామ్ధారి బెంగళూరులో 30కి పైగా స్టోర్లను ఆపరేట్ చేస్తోంది. ఈ అక్విజిషన్ ఫ్లిప్కార్ట్కు ఫుడ్, గ్రోసరీ సెగ్మెంట్లో మరింత విస్తరించడానికి సహాయపడనుందని రిపోర్టులు చెప్పాయి.