వరద ఉధృతి: ఫ్లెక్సీతో సర్పంచ్ హెచ్చరిక

వరద ఉధృతి: ఫ్లెక్సీతో సర్పంచ్ హెచ్చరిక

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు వంకలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ముంపు ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వంతెనలు తెగిపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. అశ్వారావుపేట వాగొడ్డుగూడెం మధ్య వంతెనపై నుండి వరద నీరు ప్రవహిస్తుండటంతో.. రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేస్తూ  తడికలను పెట్టి, హెచ్చరిక ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు  ఊట్లపల్లి సర్పంచ్ సాధు జోష్న బాయ్.